అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ 23 మద్యం బాటిళ్లు స్వాధీనం

భీమునిపట్నం జనసేవ : స్థానిక  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి)  సర్కిల్  ఇన్స్పెక్టర్ వి.రామకృష్ణ ఆదేశాల మేరకు ప్రొఫెషన్ & ఎక్సైజ్ ఎస్ ఐ డి పద్మావతి తమ సిబ్బందితో కలిసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 23 మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకోవడం జరిగిందని గురువారం మీడియాకు తెలిపారు. 
దీనికి సంబంధించి  పి &ఈ ఎస్ఐ డి. పద్మావతి  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.   

తగరపువలస ప్రాంతానికి చెందిన బొని తిరునాధ వద్ద నుండి 15  మద్యం సీసాలను అలాగే ఆనందపురం మండలం చందక గ్రామానికి చెందిన బొజ్జ రాజేశ్వరి వద్ద నుండి 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారిని తగరపలస ప్రాంతంలో ఒకరిని అలాగే ఆనందపురం మండలం చందక  గ్రామం వద్ద  ఒక్కరిని పట్టుకుని వారి ఇద్దరు ను అరెస్టు  చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు . 

.ఈ దాడులలో ఎస్ఐ పద్మావతి సిబ్బంది సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ ఆదేశాల మేరకు  దాడులు నిర్వహించారన్నారు😍

భీమిలి రిపోర్టర్ 
పి శ్రీనివాసరావు