భీమునిపట్నం :- మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మార్చి 1వ తేదీన డే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ చిట్టివలస బంతాట స్థలములో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించబడునని చిట్టివలస
, భీమిలి వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు బోరా శ్రీనివాస రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు నాకౌట్, లీక్ పద్ధతిలో నిర్వహించబడునని అన్నారు.
విజేతలకు మొదటి నగదు బహుమతి 8వేలు, రెండవ నగదు బహుమతి 6వేలు, మూడవ నగదు బహుమతి 4వేలు, 4వ నగదు బహుమతి 2వేలు రూపాయలు నగదు బహుమతితో పాటు జ్ఞాపకాలు కూడా అందజేయబడునని.
ఈ సందర్భంగా తెలిపారు ఈ పోటీ లో పాల్గొనేందుకు ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 8341099666, 9794325002 లను సంప్రదించాలని కోరారు
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు