గెలుపొందిన ZPTC,MPTC సభ్యుల సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

విశాఖపట్నం జిల్లా
భీమిలి నియోజకవర్గం
భీమిలి

మంత్రి గారి పార్టీ కార్యాలయంలో ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం మండలాల్లో గెలుపొందిన ZPTC,MPTC సభ్యుల సమావేశంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
శ్రీ ముత్తంశెట్టి.శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు 

ఈ సందర్భంగా మంత్రి  అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఎదురులేని శక్తిగా ఎదిగిందని 1983 తరువాత భీమిలి రూరల్ తెలుగు దేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టిందని తెలిపారు సందర్భంగా ప్రజలకు సేవ చేసేందుకు మంచి అవకాశం వచ్చింది ప్రతి సభ్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి 
వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు పేదలకు అందించే ప్రతి పథకాలు ప్రజలకు అందేలా చూడాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు 
అనంతరం రేపు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు ఎన్నిక సందర్భంగా పార్టీ బి ఫారాలు అందజేశారు 
పద్మనాభం: 

అధ్యక్షుడు కంటుబోతు.రాంబాబు 
ఉపాధ్యక్షురాలు
కోరాడ.మంజు

భీమిలి:

అధ్యక్షుడు 
వాసురాజు
ఉపాధ్యక్షుడు
బోని.బంగారునాయుడు

ఆనందపురం:

అధ్యక్షురాలు
మజ్జి.శారదా ప్రియాంక

ఉపాధ్యక్షుడు 
పాండ్రంగి.శ్రీను లకు అందజేశారు

భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు .