బీజేపీ సమావేశం

ఆనందపురం:జనసేవ న్యూస్ 

మండలంలో గృహ సంపర్క్ అభ్యాన్ లో భాగంగా విస్తారక్ గా విచ్చేసిన ఉప్పాడ అప్పారావు, బిజేపి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, పద్మనాభం మండల బిజేపి పార్టీ అధ్యక్షులు రెడ్డి పల్లి శ్రీనివాసరావు, ముఖ్య నేతల తో గృహసంపర్క్ కార్యక్రమం సంభందించిన సమావేశం జరిగింది. 

ఈ కార్యక్రమం లో భాగంగా పాండ్రంగి గ్రామ పంచాయితీ కురపల్లి గ్రామము నివాసం బిజేపి పార్టీ సీనియర్ కార్యకర్త పి. కృష్ణారావు కుటుంబాన్ని కలవడం జరిగింది. 

 ఈ కార్యక్రమంలో మండలం ప్రధాన కార్యదర్శి, మహంతి అప్పలరమణ, ,ఆర్.ఏర్రి నాయుడు గారు ఓబిసి అధ్యక్షులు, బి.అప్పలనారాయణ తదితరులు పాల్గున్నారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )