శ్రావణ పౌర్ణమి సంధర్భంగా భారతీయులంతా ఎంతో ఆనందంతో జరుపుకునేదే రాఖీ పండుగ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

శ్రావణ పౌర్ణమి సంధర్భంగా భారతీయులంతా ఎంతో ఆనందంతో జరుపుకునేదే రాఖీ పండుగ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రక్షా బంధన్ పర్వదినం సంధర్భంగా సీతమ్మధారలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఐశ్వరియా విశ్వవిద్యాలయకు చెందిన బ్రహ్మకుమారీలు మంత్రికి రక్షాబంధన్ కట్టారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ కుల, మత, వర్గ, లింగ బేధాలకు అతీతంగా జరుపుకునే పవిత్రమైన పండుగ అని అన్నారు. తోబుట్టువులందరూ ఎంతో ఆనందం, సంతోషాలతో జరుపుకునే పవిత్రమైన పండుగ అని అన్నారు. ఈ సందర్బంగా బ్రహ్మకుమారీస్ కు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.


'మన భారతాన్ని స్వర్గ సీమగా, సువర్ణ భారతంగా మార్చేందుకు స్వచ్ఛమైన మనసుతో ప్రతిఒక్కరూ కట్టేదే ఈ రాఖీ పండుగ. సోదరి ద్వారా మనసా, వాచా, కర్మణా, పవిత్రంగా, సత్సంగ జీవితాన్ని తయారు చేసుకోవడమే ఈ పండుగ ప్రత్యేకత' అని బ్రహ్మ కుమారీస్ అన్నారు - టీం అవంతి శ్రీనివాసరావు 

www.avanthisrinivasarao.com
#rakhi #rakshaBandhan #Festival2021 #AvanthiSrinivasaRao #YSRCP #YSJagan #TourismMinister #Visakhapatnam #PoliticalUpdates #GVMCstandingcommitee #avanthiinstitutions