ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు యువకులు మృతి

 *విశాఖపట్నం* : ఎయిర్ పోర్ట్- షీలానగర్ వద్ద గల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. 

పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఆనందపురం నుండి శ్రీహరిపురంలో ఉన్న స్టాక్ పాయింట్ కి వ్యాన్లో కోళ్లు తీసుకువస్తుండగా కోళ్లఫామ్ వ్యాన్ ఎయిర్ పోర్ట్ - షీలానగర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెనక నుంచి బలంగా ఢీ కొట్టడంతో వ్యాను లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

వ్యాన్ డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించామని అన్నారు.

Reporter
సురేశ్